Skip to main content

పీపీఏలను మూర్ఖంగా రద్దు చేసిన ఫలితమే రాష్ట్రంలో ఈ అంధకారం: జగన్ సర్కారుపై ధ్వజమెత్తిన చంద్రబాబు

ఏపీ సర్కారుపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరెంటు కోతల అంశాన్ని ప్రస్తావిస్తూ, పీపీఏలను మూర్ఖంగా రద్దు చేసిన ఫలితమే రాష్ట్రంలో ఈ అంధకారం అని వ్యాఖ్యానించారు. ఇది రివర్స్ డెవలప్ మెంట్ ప్రభుత్వం అని, అందుకే కరెంటు కోతలు విధిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ సర్కారు తీసుకువచ్చిన నిరంతర విద్యుత్ ను కూడా రివర్స్ చేశారని మండిపడ్డారు. 9 గంటల విద్యుత్ అని చెప్పి సగం కోత విధించారని చంద్రబాబు ట్విట్టర్ లో ఆరోపించారు.

థర్మల్ విద్యుత్ ఎప్పుడూ ఆధారపడదగింది కాదని, పైగా పర్యావరణ హితం కూడా కాదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని తాము ఎప్పుడో ఊహించామని, అందుకే సౌర, పవన విద్యుదుత్పత్తిని భారీస్థాయిలో ప్రోత్సహించామని తెలిపారు. తనకు తెలియంది ఎవరైనా చెబితే వినిపించుకోడని, ఆ జగమొండితనమే రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శాపం అయిందని చంద్రబాబు విమర్శించారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...