Skip to main content

పెరిగిన రేటు... రూ.8లక్షల విలువచేసే ఉల్లి చోరీ





onion theft in bihar after its price soarsప్రస్తుతం దేశంలో ఉల్లి ధర బాగా పెరిగింది. కేజీ ఉల్లి ధర దాదాపు రూ.80 పలుకుతోంది. దీంతో... దొంగల కన్ను ఇప్పుడు ఉల్లిపై పడింది. రేటు అమాంతం పెరగడంతో... ఉల్లి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బిహార్ రాష్ట్రం పట్నాలో దాదాపు రూ.8లక్షల విలువచేసే ఉల్లిని చోరీ చేశారు.
గోడౌన్ లో ఉన్న ఉల్లిని రెండు రోజుల క్రితం చోరీ చేసినట్లు స్థానిక  మీడియా తెలిపింది.  ప్రస్తుతం దేశంలో యాపిల్ కన్నా కూడా ఉల్లే ధర ఎక్కువ పలుకుతోంది. అందుకే... దొంగల ముఠా దీనిని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. గోడౌన్ లపై కన్నేసి ఉల్లిని కాజేశారు.
కాగా... ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దొంగతనం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వీడియో ఫుటేజీని కూడా పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా... ఉల్లిని పోగొట్టుకున్న వ్యాపారి ధీరజ్ కుమార్ మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉల్లిని దొంగతనం చేస్తారని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాపారి ధీరజ్ కుమార్ పేర్కొన్నారు. మొత్త 328 బ్యాగుల ఉల్లి చోరీకి గురైందని అతను చెప్పారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఉల్లి ధర కేజీ రూ.50 ఉందని అతను చెబుతున్నారు. నా ఉల్లి దొంగతనంతో... ఇతర వ్యాపారుల్లో కూడా కంగారు మొదలైందని అతను చెప్పడం విశేషం. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...