Skip to main content

పెరిగిన రేటు... రూ.8లక్షల విలువచేసే ఉల్లి చోరీ





onion theft in bihar after its price soarsప్రస్తుతం దేశంలో ఉల్లి ధర బాగా పెరిగింది. కేజీ ఉల్లి ధర దాదాపు రూ.80 పలుకుతోంది. దీంతో... దొంగల కన్ను ఇప్పుడు ఉల్లిపై పడింది. రేటు అమాంతం పెరగడంతో... ఉల్లి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బిహార్ రాష్ట్రం పట్నాలో దాదాపు రూ.8లక్షల విలువచేసే ఉల్లిని చోరీ చేశారు.
గోడౌన్ లో ఉన్న ఉల్లిని రెండు రోజుల క్రితం చోరీ చేసినట్లు స్థానిక  మీడియా తెలిపింది.  ప్రస్తుతం దేశంలో యాపిల్ కన్నా కూడా ఉల్లే ధర ఎక్కువ పలుకుతోంది. అందుకే... దొంగల ముఠా దీనిని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. గోడౌన్ లపై కన్నేసి ఉల్లిని కాజేశారు.
కాగా... ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దొంగతనం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వీడియో ఫుటేజీని కూడా పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా... ఉల్లిని పోగొట్టుకున్న వ్యాపారి ధీరజ్ కుమార్ మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉల్లిని దొంగతనం చేస్తారని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాపారి ధీరజ్ కుమార్ పేర్కొన్నారు. మొత్త 328 బ్యాగుల ఉల్లి చోరీకి గురైందని అతను చెప్పారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఉల్లి ధర కేజీ రూ.50 ఉందని అతను చెబుతున్నారు. నా ఉల్లి దొంగతనంతో... ఇతర వ్యాపారుల్లో కూడా కంగారు మొదలైందని అతను చెప్పడం విశేషం. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.