Skip to main content

చైనా సంస్థకు భూమిపూజ: 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..!


Roja performs bhumi puja for TCL unit near Tirupati
చైనాకు చెందిన పారిశ్రామిక దిగ్గజం టీసీఎల్.. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో భారీ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ నిర్మాణ పనులకు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా భూమిపూజ చేశారు. తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలోని ఏర్పేడు మండలం వికృతమాల వద్ద ఈ కంపెనీ నిర్మితం కానుంది. ఈ సంస్థ ప్రారంభ పెట్టుబడి 2,200 కోట్ల రూపాయలు. దీనివల్ల 6, 000మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా మరో 4000 మందికి ఉపాధి అవకాశాలు లభించడానికి అవకాశాలు ఉన్నాయని ఏపీఐఐసీ అధికారులు అంచనా వేస్తున్నారు.చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ ఈ సంస్థకు భూమిని కేటాయించింది. ఈ సంస్థకు కేటాయించిన మొత్తం భూములు 139 ఎకరాలు. గత ఏడాది డిసెంబర్ లో ఈ సంస్థకు చంద్రబాబు భూమిపూజ కోసం చేశారు. భూములను కేటాయించిన కొద్దిరోజుల వ్యవధిలోనే భూమిపూజ చేయడం పట్ల అప్పట్లో విమర్శలు తలెత్తాయి. తాజాగా- గురువారం ఈ సంస్థ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ పనులకు రోజా భూమిపూజ చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంస్థలో ఉత్పత్తి ఆరంభమౌతుందని తెలుస్తోంది. భూమిపూజ కార్యక్రమంలో టీసీఎల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అబెల్ ఝియాంగ్ పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...