Skip to main content

4న వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర ప్రారంభం

పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
- 30 వరకు దరఖాస్తుల పరిశీలన
ఆటోలు, మాక్సీక్యాబ్‌, టాక్సీలు కొనుగోలు చేసి, వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు మేలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టనున్న వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని అక్టోబర్‌ 4న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈనెల 14 నుండి 24 వరకు ఆటో, మాక్సీక్యాబ్‌, టాక్సీ డ్రైవర్లు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల ప్రక్రియకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డ్రైవర్లకు అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం ఇన్స్యూరెన్స్‌, వెహికిల్‌ ఫిట్‌ నెస్‌, మరమ్మత్తులు వంటి అవసరాలకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్‌ డ్రైవర్‌ కమ్‌ ఓనర్లు వాహన మిత్ర పథకంలో నిర్ణీత ధ్రువపత్రాలను పొందుపరచడం ద్వారా అర్హత పొందుతారు. ఈ పథకానికి అర్హులైన వారు.. ఆధార్‌ కార్డు, తెల్ల రేషన్‌ కార్డు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రుణం లేని బ్యాంక్‌ పాస్‌ బుక్‌ మొదటి పేజీ, సంబంధిత అకౌంట్‌ వివరాలను సమర్పించాలని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. అలాగే ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలైతే తమ కులధవీకరణ పత్రం కూడా సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. సమర్పించిన ధ్రువపత్రాలను గ్రామ, వార్డు వాలంటీర్లు పరిశీలించి వాహనం సదరు యజమాని సమక్షంలో ఉందో లేదో పరిశీలించనున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,75,218 దరఖాస్తులు రవాణాశాఖకు అందినట్లు సమాచారం. అధికారులు వీటిలో నేటికి 93,741 దరఖాస్తులను పరిశీలించి ఆమోదముద్ర వేశారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...