Skip to main content

4న వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర ప్రారంభం

పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
- 30 వరకు దరఖాస్తుల పరిశీలన
ఆటోలు, మాక్సీక్యాబ్‌, టాక్సీలు కొనుగోలు చేసి, వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు మేలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టనున్న వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని అక్టోబర్‌ 4న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈనెల 14 నుండి 24 వరకు ఆటో, మాక్సీక్యాబ్‌, టాక్సీ డ్రైవర్లు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల ప్రక్రియకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డ్రైవర్లకు అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం ఇన్స్యూరెన్స్‌, వెహికిల్‌ ఫిట్‌ నెస్‌, మరమ్మత్తులు వంటి అవసరాలకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్‌ డ్రైవర్‌ కమ్‌ ఓనర్లు వాహన మిత్ర పథకంలో నిర్ణీత ధ్రువపత్రాలను పొందుపరచడం ద్వారా అర్హత పొందుతారు. ఈ పథకానికి అర్హులైన వారు.. ఆధార్‌ కార్డు, తెల్ల రేషన్‌ కార్డు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రుణం లేని బ్యాంక్‌ పాస్‌ బుక్‌ మొదటి పేజీ, సంబంధిత అకౌంట్‌ వివరాలను సమర్పించాలని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. అలాగే ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలైతే తమ కులధవీకరణ పత్రం కూడా సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. సమర్పించిన ధ్రువపత్రాలను గ్రామ, వార్డు వాలంటీర్లు పరిశీలించి వాహనం సదరు యజమాని సమక్షంలో ఉందో లేదో పరిశీలించనున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,75,218 దరఖాస్తులు రవాణాశాఖకు అందినట్లు సమాచారం. అధికారులు వీటిలో నేటికి 93,741 దరఖాస్తులను పరిశీలించి ఆమోదముద్ర వేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...