జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన దరిమిలా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనేకమంది పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణ కోసం ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనం అక్టోబరు 1 నుంచి పిటిషన్లపై విచారణ జరపనుంది.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment