Skip to main content

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 30న అపాయింట్ మెంట్ ఆర్డర్లు

వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల సాయంతో పరిపాలన నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఉద్యోగుల కోసం నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. కొన్నిరోజుల క్రితమే పరీక్ష ఫలితాలు వెల్లడి కావడం, మెరిట్ లిస్టు విడుదల చేయడం జరిగింది. దీనిపై మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 30న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. సీఎం జగన్ చేతులమీదుగా అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇకపై ప్రజాపాలన స్థానిక సచివాలయాల ద్వారానే అందిస్తామని చెప్పారు. అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాల్లో పౌరసేవలు ప్రారంభమవుతాయని, 72 గంటల్లో పూర్తయ్యేలా 10 సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, ఆ తర్వాత సేవలను మరింత పెంచుకుంటూ పోతామని విజయ్ కుమార్ వివరించారు.

పట్టణాల్లో ప్లాన్, బిల్డింగ్ అనుమతులు మూడ్రోజుల్లోనే ఇస్తామని, డెత్, బర్త్ సర్టిఫికెట్ నమూనాలను వెంటనే ఇచ్చేస్తామని తెలిపారు. వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు భరోసా, పెన్షన్లు వంటి పథకాలను గ్రామ సచివాలయాల ద్వారానే అమలు చేస్తామని అన్నారు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...