ఏపీలో గత ప్రభుత్వ హయాంలో విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించిన జీవోను వైసీపీ ప్రభుత్వం నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను తమ హయాంలో రద్దు చేశామని, మళ్లీ ఇప్పుడు రద్దు చేయడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబునాయుడిని మళ్లీ గోబెల్స్ ఆత్మ ఆవహించిందని, నిజం మాట్లాడటమే మర్చిపోయారని విమర్శించారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ 2015 నవంబరు 5న జీవో నంబర్ 97 జారీ చేసింది చంద్రబాబే అని, రద్దయిన జీవోను తిరిగి క్యాన్సిల్ చేయడమేంటని ఆయన ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment