Skip to main content

రివర్స్ టెండరింగ్‌లో రూ.200 కోట్లు ఆదా అయినా మంచిదే... జీవీఎల్ నర్సింహరావు

Image result for GVL NARASIMHARAOపోలవవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌లో కనీసం రూ.200 కోట్లు ఆదా అయినా ఆహ్వానించదగ్గ విషయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. ఖర్చు తగ్గించి ప్రాజెక్టులు నిర్మాణాలు చేస్తే అభ్యంతరం ఎవరికి ఉండదని అన్నారు. మరోవైపు పీపీఏల అనుమతుల్లో అవినీతీ లేదని తాము చెప్పలేదని, వాటిపట్ల సూచనలు మాత్రమే చేస్తున్నామని అన్నారు .పెట్టుబడుల కోసం ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్న సమయంలో గందరగోళం లేకుండా చూడాలని ఆయన సూచించారు.ఇక ఇటివల కేంద్రం ప్రకటించిన కార్పోరేట్‌లో పన్ను తగ్గింపుతో పెట్టుబడులు వస్తాయని తెలిపారు. పెట్టుబడులు రావటం వల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన వంద రోజుల్లో కేంద్రప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ప్రంశసిస్తున్నాయని ఆయన తెలిపారు.ఇటివల టీడీపీ నుండి బీజేపీలో చేరిన ఎంపీల కేసులు ఏవీ మాఫి కావని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సిద్దాంతాలు నచ్చినవారే బీజేపీలోకి వస్తున్నారని అన్నారు. టీడీపీ నుండి వచ్చిన నేతలు బీజేపీ భావజాలంతోనే పని చేయాలని ఆయన సూచించారు. ఇక వారి కేసులకు సంబంధించి వారే సమాధానం చెప్పుకోవాలని చెప్పారు. వైసీపీతో కూడ తమకు రాజకీయ అనుబంధం లేదని చెప్పిన ఆయన తప్పు చేస్తే నిలదీస్తామని అన్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...