Skip to main content

రివర్స్ టెండరింగ్‌లో రూ.200 కోట్లు ఆదా అయినా మంచిదే... జీవీఎల్ నర్సింహరావు

Image result for GVL NARASIMHARAOపోలవవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌లో కనీసం రూ.200 కోట్లు ఆదా అయినా ఆహ్వానించదగ్గ విషయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. ఖర్చు తగ్గించి ప్రాజెక్టులు నిర్మాణాలు చేస్తే అభ్యంతరం ఎవరికి ఉండదని అన్నారు. మరోవైపు పీపీఏల అనుమతుల్లో అవినీతీ లేదని తాము చెప్పలేదని, వాటిపట్ల సూచనలు మాత్రమే చేస్తున్నామని అన్నారు .పెట్టుబడుల కోసం ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్న సమయంలో గందరగోళం లేకుండా చూడాలని ఆయన సూచించారు.ఇక ఇటివల కేంద్రం ప్రకటించిన కార్పోరేట్‌లో పన్ను తగ్గింపుతో పెట్టుబడులు వస్తాయని తెలిపారు. పెట్టుబడులు రావటం వల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన వంద రోజుల్లో కేంద్రప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ప్రంశసిస్తున్నాయని ఆయన తెలిపారు.ఇటివల టీడీపీ నుండి బీజేపీలో చేరిన ఎంపీల కేసులు ఏవీ మాఫి కావని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సిద్దాంతాలు నచ్చినవారే బీజేపీలోకి వస్తున్నారని అన్నారు. టీడీపీ నుండి వచ్చిన నేతలు బీజేపీ భావజాలంతోనే పని చేయాలని ఆయన సూచించారు. ఇక వారి కేసులకు సంబంధించి వారే సమాధానం చెప్పుకోవాలని చెప్పారు. వైసీపీతో కూడ తమకు రాజకీయ అనుబంధం లేదని చెప్పిన ఆయన తప్పు చేస్తే నిలదీస్తామని అన్నారు.

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.