Skip to main content

కోడెల ఆత్మహత్యపై నోటీసులు: 11 రోజుల గడువు అడిగిన ఫ్యామిలీ

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసుకు సంబంధించి విచారణకు రావాలని బంజారాహిల్స్ పోలీసులు కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే  11 రోజుల తర్వాత విచారణఖు హాజరుకానున్నట్టుగా కోడెల  శివప్రసాద్ రావు కుటుంబసభ్యులు స్పష్టం చేశారు.

ఈ నెల 16వ తేదీన హైద్రాబాద్ లోని తన నివాసంలో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ కేసుకు సంబంధించి కుటుంబసభ్యులను విచారణ చేయాలని  హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు భావిస్తున్నారు.

ఈ విషయమై  కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు పోలీసులు విచారణకు రావాలని కోరారు. అయితే  11 రోజుల తర్వాత విచారణకు హాజరు అవుతామని  కోడెల శిప్రసాద్ రావు కుటుంబసభ్యులు చెప్పారు.

ఆత్మహత్యకు ముందు కోెల శివప్రసాద్ రావు తన గన్‌మెన్‌కు ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకొన్న రోజున కోడెల శివప్రసాద్ రావు ఎవరెవరికి ఫోన్ చేశాడనే విషయమై కూడ ఆరా తీస్తున్నారు. 

మరో వైపు అంతకుముందు కూడ ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోడెల తిన్న టిఫిన్ తో పాటు ఇతర విషయాలపై కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.

కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్న గదిని కూడ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. కోడెల శివప్రసాద్ రావు ఇంటికి ఎవరు వచ్చినా కూడ తమకు సమాచారం ఇవ్వాలని కూడ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

కోడెల శివప్రసాద్ రావు సెల్‌ఫోన్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్య చేసుకొన్న రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు కోడెల శివప్రసాద్ రావు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది.

కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసు విషయమై ఆయన మేనల్లుడు గుంటూరు జిల్లా నర్సరావుపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును  ఆ జిల్లా పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు పంపారు.


Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...