Skip to main content

అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1న జరపాలి

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న జరపాలంటూ ‘ఆంధ్ర మేథావుల ఫోరం’ ముఖ్యమంత్రి జగన్మోహన్ కి వినతిని సమర్పించింది. ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వినతిలో క్రింది అంశాలను ప్రస్తావించారు... అవి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నేటి వరకూ విభజన తరువాత అవతరణ దినోత్సవం జరపటం ఆపివేసినదని.. మొదటగా జూన్ 2న ఆ దినోత్సవం జరపాలని నిర్ణయించగా తమ వేదిక నాడే తీవ్రంగా వ్యతిరేకించినదని తెలిపారు. వ్యవహారికంగా చూస్తే అక్టోబర్ 1 , 1953 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగా ఆరోజు పుట్టినరోజుగా, నవంబర్ 1, 1956లో తెలంగాణతో వివాహదినం, అదే జూన్ 2 విడాకుల దినంగా మాత్రమే అవుతుందని తెలిపారు. అక్టోబర్ 1న ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాల్సిందిగా మేము గత ప్రభుత్వాన్ని అనేకసార్లు అడిగాము. స్పందన లేదని,  ఈ విషయమై తక్షణ చర్య తీసుకుని అవతరణ దినోత్సవం జరపవలసిందిగా జ‌గ‌న్‌ని కోరుతున్న‌ట్టు  ఫోరం ప్ర‌తినిధులు చెప్పారు.





Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.